Telangana: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా రోజువారీ కేసులు

  • గత 24 గంటల్లో 18,571 కరోనా పరీక్షలు
  • 255 మందికి పాజిటివ్
  • హైదరాబాదులో 95 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 357 మంది
  • ఇంకా 2,154 మందికి చికిత్స
Telangana corona stats

గత కొన్నిరోజులుగా తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 18,571 శాంపిల్స్ పరీక్షించగా, 255 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో 95 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 23, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేసులు గుర్తించారు. మరో 509 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,33,776 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,27,511 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,154 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.

More Telugu News