Mahesh Babu: హిందీలో 'బిజినెస్ మేన్' రీమేక్ ఉంటుంది: పూరి

  • 'లైగర్' ప్రమోషన్స్ లో బిజీగా పూరి 
  • రేపు విడుదలవుతున్న సినిమా
  • 'పోకిరి' .. 'బిజినెస్ మెన్' సీక్వెల్స్ పై స్పందించిన పూరి
  • 'బిజినెస్ మేన్' హిందీ రీమేక్ చేస్తానని వెల్లడి
Puri Interview

హీరోగా మహేశ్ బాబు .. దర్శకుడిగా పూరి జగన్నాథ్ చాలానే సినిమాలు చేశారు. ఇద్దరి కెరియర్లోను చెప్పుకోదగిన సినిమాల జాబితాలో 'పోకిరి' .. 'బిజినెస్ మేన్' కనిపిస్తాయి. సంచలన విజయాలను సాధించిన ఈ రెండు సినిమాలకి సీక్వెల్స్ వస్తే బాగుంటుందని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

ఆ రెండు కథలకు సీక్వెల్ లాగే దమ్ముందనీ .. ఆ రెండు సినిమాల్లోని హీరో పాత్రలంటే తనకి చాలా ఇష్టమని 'లైగర్' ప్రమోషన్స్ లో పూరి అన్నాడు. అప్పట్లోనే తానూ సీక్వెల్స్ ప్లాన్ చేసినా మహేశ్ బిజీగా ఉండటం వలన వీలుపడలేదని చెప్పాడు. అన్నీ కలిసొస్తే తెలుగులో ఈ సీక్వెల్స్ ఉంటాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

ఇక 'బిజినెస్ మేన్' సినిమాను మాత్రం హిందీలో రీమేక్ చేసే ఆలోచన ఉందనీ, అందుకు సంబంధించిన సన్నాహాలను త్వరలోనే మొదలుపెడతామని చెప్పాడు. మరి కరణ్ జొహార్ తో కలిసి పూరి ఏ బాలీవుడ్ హీరోను సెట్ చేస్తాడో చూడాలి. ఆయన తాజా చిత్రమైన 'లైగర్' పాన్ ఇండియా స్థాయిలో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News