Mahesh Babu: మహేశ్ మూవీకి ఫైట్స్ హైలైట్!

  • మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్టు 
  • రంగంలోకి దిగిన ప్రముఖ ఫైట్ మాస్టర్లు 
  • వచ్చే ఏప్రిల్ 28వ తేదీన సినిమా రిలీజ్
Mahesh Babu and Trivikram Movie Update

మహేశ్ బాబు తన 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో త్రివిక్రమ్ - మహేశ్ కాంబినేషన్లో వచ్చిన 'అతడు' సినిమా మాదిరిగానే, యాక్షన్ ఎంటర్టయినర్ గా ఈ సినిమా ఉండనుందనే టాక్ చాలా రోజుల క్రితమే వచ్చింది. 

అందుకు తగినట్టుగానే ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రముఖ ఫైట్ మాస్టర్లు అన్బు - అరివు రంగంలోకి దిగిపోయినట్టుగా చెబుతున్నారు. వాళ్లు కంపోజ్ చేసిన ఫైట్స్ 'కేజీఎఫ్' .. 'కేజీఎఫ్ 2' .. 'విక్రమ్' వంటి సినిమాల సక్సెస్ లో ముఖ్యమైన పాత్రను పోషించాయి. శంకర్ - చరణ్ సినిమాకి కూడా వాళ్లే యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తూ వస్తున్నారు. 

అలాంటి వాళ్లిద్దరూ కూడా మహేశ్ సినిమా కోసం కొత్తగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి ఫైట్స్ హైలైట్ గా ఉండాలనే త్రివిక్రమ్ చెప్పినట్టుగా సమాచారం. మహేశ్ సరసన కథానాయికగా పూజ హెగ్డే అలరించనున్న ఈ సినిమాను, వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News