Road Accident: స్కాట్లాండ్ లో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం

  • అప్పిన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం
  • మొత్తం ముగ్గురి మృతి
  • బెంగళూరుకు చెందిన విద్యార్థి కూడా మృతి
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Two Telugu students killed in fatal accident in Scotland

ఉన్నత విద్యాభ్యాసం కోసం స్కాట్లాండ్ వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ నెల 19న స్కాట్లాండ్ హైల్యాండ్ లోని అప్పిన్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నెల్లూరుకు చెందిన 30 ఏళ్ల సుధాకర్, హైదరాబాద్ కు చెందిన పవన్ బాశెట్టి (23) దుర్మరణం పాలయ్యారు. బెంగళూరుకు చెందిన గిరీశ్ సుబ్రహ్మణ్యం (23) అనే మరో విద్యార్థి కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ కు చెందిన సాయివర్మ (24) తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాద ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రకటన చేశారు. పవన్ బాశెట్టి, గిరీశ్ సుబ్రహ్మణ్యం లీసెస్టర్ యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ మాస్టర్స్ చేస్తున్నారు. సుధాకర్ కు మాస్టర్స్ పూర్తయింది.

More Telugu News