Allu Arjun: 'పుష్ప 2' విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!

  • సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
  • ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకి పైగా వసూళ్లు  
  • సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకుని వెళుతున్న టీమ్
  • వచ్చే వేసవిలో విడుదల చేయాలనే ఆలోచన
Pushpa 2 movie update

సుకుమార్ ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లే పనిలో ఉన్నాడు. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమాకి సుకుమార్ కూడా ఒక నిర్మాతగా ఉన్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఫస్టు పార్టును మైత్రీవారు నిర్మించగా, ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా వసూలు చేసింది.

హిందీలో ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. 'పుష్ప' అనుకోకుండా పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. ఇక ఇప్పుడు 'పుష్ప 2'ను పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మిస్తున్నారు. ఆ దిశగానే కోలీవుడ్ .. బాలీవుడ్ నుంచి మరికొంతమంది స్టార్స్ ను తీసుకుంటున్నారు.

ఆల్రెడీ సుకుమార్ నిర్మాతగా చిన్న సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. 'పుష్ప' తెచ్చిపెట్టిన లాభాలు .. 'పుష్ప 2'పై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకున్న సుకుమార్ ఈ సినిమాకి ఒక నిర్మాతగా ఉన్నట్టు చెబుతున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News