Allu Arjun: పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'పుష్ప 2'

  • సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
  • సీక్వెల్ కి సిద్ధమైన టీమ్ 
  • త్వరలోనే మొదలుకానున్న రెగ్యులర్ షూటింగ్ 
  • వచ్చే సమ్మర్ లో విడుదల చేసే ఆలోచన
Pushpa 2 movie update

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'పుష్ప' సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'పుష్ప 2'ను రూపొందించడానికి రంగంలోకి దిగారు. కొంతకాలంగా అందుకు సంబంధించిన సన్నాహాలను చేస్తూ వచ్చారు. ఈ రోజున ఏకాదశి .. మంచిరోజు కావడంతో ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 

ఈ పూజా కార్యక్రమాలలో దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది. ఈ సినిమాలోను కథానాయికగా రష్మిక అలరించనుంది. ఫస్టు పార్టులో స్పెషల్ సాంగులో సందడి చేసిన సమంత ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని అంటున్నారు.

మలయాళం స్టార్ ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి మనోజ్ బాజ్ పాయ్ నీ, కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతిని తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటల పనిలో దేవిశ్రీ ఉన్నాడని అంటున్నారు. వచ్చే సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

More Telugu News