Puri Jagannadh: 'పుష్ప' క్లైమాక్స్ నచ్చింది: పూరి జగన్నాథ్

  • 'ఈ నెల 25వ తేదీన రానున్న 'లైగర్'
  • ప్రమోషన్స్ లో బిజీగా పూరి జగన్నాథ్ 
  • 'లైగర్' క్లైమాక్స్ కొత్తగా ఉంటుందంటూ వ్యాఖ్య
  • తప్పకుండా హిట్ అంటూ ఫ్యాన్స్ కి భరోసా  
Puri Interview

'ఇస్మార్ట్ శంకర్'తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్, ఆ తరువాత సినిమాగా 'లైగర్'ను థియేటర్లకు తీసుకుని రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పూరి - విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నారు.

తాజా ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ .. "రోడ్డుపక్కన చాయ్ అమ్ముకునే ఒక తల్లి తన కొడుకును ఎలా చూడాలనుకుంది? అందుకోసం ఆ కొడుకు ఎంతగా కష్టపడ్డాడు? అనేదే కథ. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ క్లైమాక్స్ గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు. అంత గొప్పగా దానిని డిజైన్ చేయడం జరిగింది. 

ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాల్లో 'పుష్ప' క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది. హీరో - విలన్ ప్రశాంతంగా కూర్చుని కూల్ గా మాట్లాడుకోవడం నాకు కొత్తగా అనిపించింది. 'లైగర్' క్లైమాక్స్ కూడా అంతే కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందనే నమ్మకం నాకు ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News