Justice N.V. Ramana: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను సతీసమేతంగా కలిసిన ఏపీ సీఎం

  • విజయవాడ చేరుకున్న సీజేఐ రమణ
  • నోవాటెల్ హోటల్‌లో 20 నిమిషాలపాటు సీజేఐతో జగన్ భేటీ
  • నూతన న్యాయస్థానాల భవనాలను ప్రారంభించనున్న జస్టిస్ రమణ
  • మరికాసేపట్లో సీజేఐతో చంద్రబాబు భేటీ
AP CM Jagan meets CJI NV Ramana

విజయవాడ చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా కలుసుకున్నారు. నగరంలోని నోవాటెల్ హోటల్‌లో ఉన్న జస్టిస్ రమణను భార్య భారతితో కలిసి కలుసుకున్నారు. ఈ సందర్భంగా 20 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ఇది మర్యాదపూర్వక భేటీయేనని చెబుతున్నారు. 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, సీఎం జగన్‌తో కలిసి విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో నిర్మించిన జీ ప్లస్ 7 నూతన భవనాలను నేడు సీజీఐ ప్రారంభిస్తారు. ఈ భవనంలో 29 విశాలమైన ఏసీ కోర్టుల హాళ్లు, ఏడు లిఫ్టులు, న్యాయవాదులు, కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు, క్యాంటీన్ సహా అన్ని సదుపాయాలతో ఈ నూతన భవనాలను తీర్చదిద్దారు. కాగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా మరికాసేపట్లో సీజేఐ జస్టిస్ రమణను కలవనున్నారు.

More Telugu News