Mahesh Babu: మహేశ్ తో సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే: రాజమౌళి

  • మహేశ్ 28వ సినిమాకి మొదలైన సన్నాహాలు 
  • వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు
  • 29వ సినిమా రాజమౌళితో 
  • వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్ పైకి   
Mahesh Babu and Rajamoui project update

రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. రికార్డు స్థాయిలో ఈ సినిమా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరూ కూడా పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. రాజమౌళి తన తాజా చిత్రాన్ని మహేశ్ బాబుతో చేయనున్నాడనే విషయం చాలా రోజుల క్రితమే బయటికి వచ్చింది.

ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే ప్రచారం జరుగుతున్నప్పుడు, అందులో వాస్తవం లేదని రాజమౌళి స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక వేదికపై ఆయన ఈ సినిమాను గురించి మరోసారి ప్రస్తావించారు. 

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు జరుగుతుందనీ, వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చనున్నారు. తన 29వ సినిమాను త్రివిక్రమ్ తో చేయనున్న మహేశ్, రాజమౌళి ప్రాజెక్టు మొదలయ్యేనాటికి రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడన్న మాట.

More Telugu News