Nikhil: ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ పరమేశ్వరన్

  • ఈ నెల 13న రిలీజ్ అయిన 'కార్తికేయ 2'
  • నిఖిల్ జోడీగా నటించిన అనుపమ 
  • ఈ టీమ్ తో జర్నీ పూర్తయినందుకు బాధగా ఉందంటూ వ్యాఖ్య 
  • ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పిన అనుపమ  
Karthikeya 2 movie success meet

నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా 'కార్తికేయ 2' రూపొందింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, కొంత సేపటి క్రితం ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.

ఈ వేదికపై అనుపమ మాట్లాడుతూ .. "నాకు ఎప్పుడూ కూడా స్టేజ్ మీద ఇంత టెన్షన్ ఉండదు. ఈ రోజున స్టేజ్ పైకి వస్తుండగానే షివరింగ్ మొదలైంది. సినిమా హిట్ అయింది కదా .. నువ్వెందుకు హ్యాపీగా లేవని నా ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు .. నిఖిల్ తో సహా. ఈ సినిమా కోసం ఇంతకాలంగా చేస్తూ వచ్చిన జర్నీ అయిపోయిందనే బాధే నాకు ఎక్కువగా ఉంది. 

ఆ బాధవల్లనే నేను ఈ హిట్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు .. నన్ను భరించినందుకు చందూ మొండేటి గారికి .. నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు .. వాళ్ల  వరకూ ఈ సినిమాను తీసుకెళ్లిన మీడియాకు కృతజ్ఞతలు" అంటూ చెప్పుకొచ్చింది.

More Telugu News