Jawans: జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడి... ముగ్గురు సైనికుల మృతి

  • రాజౌరీ సమీపంలో కాల్పులు
  • పర్గల్ వద్ద సైనిక శిబిరంలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదుల యత్నం
  • ఆత్మాహుతి దాడికి ప్రయత్నించిన వైనం
  • దీటుగా తిప్పికొట్టిన భద్రతా బలగాలు
Three army jawans martyred in Jammu Kashmir in a firing exchange with terrorists

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు భారత సైన్యం లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మృతి చెందగా, ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు. రాజౌరీ ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్గల్ ఆర్మీ క్యాంపు వద్ద ఈ దాడి జరిగింది. 

సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు యత్నించారు. శిబిరంలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించడాన్ని గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే స్పందించాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ దాడిలో మరో ఐదుగురు సైనికులకు గాయాలయ్యాయి. 

ప్రస్తుతం అక్కడ మరింతమంది ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో భారీ ఎత్తున గాలింపు చేపడుతున్నారు. పర్గల్ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో బలగాలను తరలిస్తున్నారు.

More Telugu News