Telangana: తెలంగాణలో కొత్తగా 605 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 38,031 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 231 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 992 మంది
  • ఇంకా 4,720 మందికి చికిత్స
Telangana corona media report

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,031 కరోనా పరీక్షలు నిర్వహించగా, 605 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 231 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 42, రంగారెడ్డి జిల్లాలో 38, కరీంనగర్ జిల్లాలో 30 కేసులు గుర్తించారు. అదే సమయంలో 992 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,27,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,18,552 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,720 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

More Telugu News