Karthi: ఆ తర్వాతే 'ఖైదీ' సీక్వెల్ మొదలవుతుంది: హీరో కార్తి

  • కార్తి తాజా చిత్రంగా రూపొందిన 'విరుమన్'
  • కథానాయికగా అదితి శంకర్ పరిచయం 
  • ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల
  • విజయ్ తో లోకేశ్ చేస్తున్న సినిమా తర్వాతే సీక్వెల్ అంటున్న కార్తి  
Khaidi Movie Sequel Update

కార్తి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'ఖైదీ' ఒకటి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పుడు ఉంటుందనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది.

కార్తి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'విరుమన్' రెడీ అవుతోంది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కార్తి 'ఖైదీ' సీక్వెల్ గురించి కూడా ప్రస్తావించాడు. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్, విజయ్ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాడనీ, ఆ తరువాత 'ఖైదీ' సీక్వెల్ ఉంటుందని చెప్పాడు. 

'మాస్టర్' సినిమాతో విజయ్ కి హిట్ ఇచ్చిన లోకేశ్, చాలా తక్కువ గ్యాప్ లో ఆయనతో మరో సినిమా చేస్తుండటం విశేషం. ఈ సినిమా పూర్తయిన తరువాత 'ఖైదీ' సీక్వెల్ చేసి, ఆ తరువాత 'విక్రమ్' సీక్వెల్ చేస్తాడని సమాచారం. ఇక 'విరుమన్' డైరెక్టర్ శంకర్ కూతురు 'అదితి' హీరోయిన్ గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News