Mahesh Babu: మహేశ్ మూవీలో కీలక పాత్రలో వేణు తొట్టెంపూడి!

  • 'స్వయంవరం' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన త్రివిక్రమ్ 
  • అదే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణు
  • మళ్లీ ఇంతకాలానికి కుదిరిన కాంబినేషన్
  • ఇటీవలే రవితేజ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన వేణు
Trivikram and Mahesh Babu movie update

వేణు తొట్టెంపూడి హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత కేరెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశాడు. 'దమ్ము' సినిమా తరువాత మాత్రం ఆయన తెరపై కనిపించలేదు. పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన, ఇటీవల వచ్చిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే ఆ సినిమా అంతగా ఆడలేదు.
 
చాలాకాలం తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన వేణుకి హిట్ పడలేదే అని చాలామంది ఫీలయ్యారు. ఈ నేపథ్యంలోనే వేణుకి త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ దొరికినట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ - వేణు ఇద్దరూ కూడా 'స్వయంవరం' సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ సినిమాకి త్రివిక్రమ్ కథ  - సంభాషణలు అందించాడు. 

త్రివిక్రమ్ ఇప్పుడు తన తాజా చిత్రాన్ని మహేశ్ బాబుతో చేయనున్నాడు. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. మరో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం వేణుని ఎంపిక చేసుకున్నారని సమాచారం.

More Telugu News