Team India: కామన్వెల్త్ క్రీడల క్రికెట్: టీమిండియా స్కోరు 164/5... లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ మహిళల దూకుడు

  • బర్మింగ్ హామ్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
  • నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు
  • వేగంగా ఆడిన స్మృతి మంధన
  • రాణించిన జెమీమా
Team India women set England 165 runs target in Commonwealth Games semifinal

బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల క్రికెట్ సెమీస్ లో టీమిండియా మహిళలు ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన చెలరేగి ఆడుతూ 32 బంతుల్లోనే 61 పరుగులు చేసింది. స్మృతి 8 ఫోర్లు, 3 సిక్సులు బాదింది. 

అనంతరం జెమీమా రోడ్రిగ్స్ 44, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 20, దీప్తి శర్మ 22 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రేయా కెంప్ 2, కాథరిన్ బ్రంట్ 1, కెప్టెన్ నటాలీ సివర్ 1 వికెట్ తీశారు. 

లక్ష్యఛేదనను ఇంగ్లండ్ దూకుడుగా ఆరంభించింది. 2 ఓవర్లలోనే 24 పరుగులు చేసింది. అయితే, మూడో ఓవర్లో ఇంగ్లండ్ దూకుడుకు అడ్డుకట్ట పడింది. ఓపెనర్ సోఫీ డన్ క్లేను దీప్తి శర్మ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. డన్ క్లే 10 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 42 పరుగులు. క్రీజులో ఓపెనర్ డానియెల్లే వ్యాట్ (20 బ్యాటింగ్), అలిస్ కాప్సే ఉన్నారు.

More Telugu News