Sahera Begum: విజయవాడ విజిలెన్స్ సీఐ సహెరా బేగంకు అరుదైన గౌరవం

  • మహిళల పట్ల దాడులు-హింసపై అమెరికాలో సదస్సులు
  • ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 2 వరకు సమావేశాలు
  • సహెరా బేగంను ఆహ్వానించిన అమెరికా ప్రభుత్వం
US govt invites Vijayawada Vigilance CI Sahera Begum

విజయవాడ విజిలెన్స్ సీఐ సహెరా బేగం అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అమెరికాలో జరిగే అంతర్జాతీయ ప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానం లభించింది. మహిళలపై దాడులు-హింస అంశంపై ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 2 వరకు అమెరికాలో సదస్సులు నిర్వహించనున్నారు. 

మహిళల పట్ల పురుషుల బాధ్యత, మహిళలపై అకృత్యాలు, తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ సదస్సుల్లో పాల్గొనాలంటూ సీఐ సహెరా బేగంకు హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. కాగా, ఈ సదస్సులకు పలు దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. వివిధ దేశాల్లో మహిళల పరిస్థితిపై తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకోనున్నారు.

More Telugu News