Vasireddy Padma: గోరంట్ల మాధవ్ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోండి: డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ

  • ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్న మాధవ్ వీడియో కాల్
  • అది మార్ఫింగ్ వీడియో అని ఇప్పటికే చెప్పిన మాధవ్
  • నిజాలను నిగ్గు తేల్చాలని డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ
Vasireddy Padma letter to DGP requesting probe in Gorantla Madhav video issue

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాలింగ్ వ్యవహారం ఏపీలో రాజకీయపరంగా కలకలం రేపుతోంది. అది మార్ఫింగ్ వీడియో అని గోరంట్ల మాధవ్ ఢిల్లీలో మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే అది ఫేక్ వీడియో అని తేలుతుందని ఆయన చెప్పారు.

మరోవైపు, అది ఒరిజినల్ వీడియోనే అని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు. వీడియో వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఈ ఘటనలో నిజాలను నిగ్గు తేల్చాలని అన్నారు.

More Telugu News