Justice N.V. Ramana: జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు ఓయూ గౌర‌వ డాక్ట‌రేట్‌

  • ఓయూలో 82వ స్నాత‌కోత్స‌వం
  • ఠాగూర్ స్టేడియంలో జ‌రిగిన వేడుక‌
  • జ‌స్టిస్ ఎన్వీ మ‌ర‌ణ‌కు డాక్ట‌రేట్ ప్ర‌దానం చేసిన తెలంగాణ గ‌వర్న‌ర్‌
cji justice nv ramana recieves honorary dectorate from osmania versity

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు తెలంగాణ‌లోని ప్ర‌తిష్ఠాత్మ‌క ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం గౌర‌వ డాక్ట‌రేట్‌ను ప్ర‌క‌టించింది. ఓయూ డాక్ట‌రేట్‌ను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ శుక్ర‌వారం వ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోని ఠాగూర్ స్టేడియంలో ఏర్పాటైన 82వ స్నాత‌కోత్స‌వంలో భాగంగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు అంద‌జేశారు. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా కొన‌సాగుతున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఈ నెల‌లోనే ఆ ప‌ద‌వి నుంచి ప‌ద‌వీ విర‌మ‌ణ పొంద‌నున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ఓయూ గౌర‌వ డాక్ట‌రేట్‌ను ప్ర‌దానం చేసింది.

More Telugu News