Komatireddy Raj Gopal Reddy: ఈ నెల 21న అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీలో చేర‌తాను: కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి

  • ఢిల్లీలో అమిత్ షాను క‌లిసిన రాజ‌గోపాల్ రెడ్డి
  • అమిత్ షా త‌న‌ను బీజేపీలోకి ఆహ్వానించార‌ని వెల్ల‌డి
  • బ‌హిరంగ స‌భ‌లోనే బీజేపీలో చేర‌తాన‌న్న కోమ‌టిరెడ్డి
komatireddy rajagopal reddy says he will joins bjp on 21st of this month

కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ద‌క్కిన మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి శుక్ర‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాను ఈ నెల 21న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స‌మక్షంలో బీజేపీలో చేర‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి... ఆ వేదిక‌పైనే తాను బీజేపీలో చేర‌తాన‌ని ఆయన వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఢిల్లీలో అమిత్ షాను క‌లిసిన అనంత‌రం ఆయ‌న అక్క‌డే మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ‌కు చెందిన బీజేపీ నేత వివేక్‌తో క‌లిసి తాను అమిత్ షాను క‌లిసిన‌ట్లు రాజ‌గోపాల్ రెడ్డి వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను అమిత్ షా బీజేపీలోకి ఆహ్వానించార‌ని చెప్పారు. అందుకు తాను కూడా సానుకూలంగానే స్పందించిన‌ట్లు తెలిపారు. బీజేపీలో చేరేందుకు ఏర్పాటు చేయ‌నున్న బ‌హిరంగ స‌భ‌కు వ‌స్తాన‌ని అమిత్ షా చెప్పార‌ని ఆయ‌న తెలియజేశారు. 

More Telugu News