Janasena: జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసాకు ఎన్నారైల సాయం రూ.50 లక్ష‌లు

  • ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌కు అండ‌గా జ‌న‌సేన‌
  • చ‌నిపోయిన కౌలు రైతుల కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున సాయం
  • కౌలు రైతు భ‌రోసాకు రూ.50 ల‌క్ష‌ల ఇచ్చిన ఎన్నారైలు
  • ప‌వ‌న్‌, నాగ‌బాబుల‌కు చెక్కు అంద‌జేత‌
nris donates 50 lack rupees for janasena koulu raithu bharosa

సాగు క‌లిసిరాక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌ను ఆదుకునేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కౌలు రైతు భ‌రోసా పేరిట ఓ ప్ర‌త్యేక కార్యక్ర‌మాన్ని చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున జ‌న‌సేన సాయం అంద‌జేస్తోంది. ఇందుకోసం ప‌వ‌న్ కల్యాణ్ త‌న వ్య‌క్తిగ‌త హోదాలో రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే ఏపీలోని ప‌లు జిల్లాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ కార్య‌క్ర‌మానికి ఎన్నారైల నుంచి భారీ సాయం అందింది. మంగ‌ళ‌వారం రాత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిసిన తెలుగు నేల‌కు చెందిన ప‌లువురు ఎన్నారైలు రూ.50 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌న‌సేన పీఏసీ స‌భ్యుడు నాగ‌బాబు కూడా పాల్గొన్నారు.

More Telugu News