Airport: చెన్నైలో మరో భారీ విమానాశ్రయం... సీఎం స్టాలిన్ ప్రకటన

  • చెన్నైలో ఇప్పటికే ఓ అంతర్జాతీయ విమానాశ్రయం
  • పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య
  •  కార్గో సేవలకు డిమాండ్
  • కొత్త ఎయిర్ పోర్టు తప్పనిసరి అని పేర్కొన్న స్టాలిన్
  • రూ.20 వేల కోట్లతో విమానాశ్రయం
CM Stalin announces another airport in Chennai

చెన్నై మహానగరంలో ఇప్పటికే ఓ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా, మరో భారీ విమానాశ్రయం నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సీఎం స్టాలిన్ ప్రకటన చేశారు. డీఎంకే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుందని, ప్రస్తుతం డీపీఆర్ రూపొందించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని స్టాలిన్ తెలిపారు. ప్రభుత్వ సంస్థ టిడ్కో చెన్నై సమీపంలోని పరందూర్ లో నూతన విమానాశ్రయం కోసం స్థలాన్ని అన్వేషిస్తోందని వెల్లడించారు.

రూ.20 వేల కోట్ల ఖర్చుతో ఈ ఎయిర్ పోర్టును నిర్మిస్తామని, సాలీనా 10 కోట్ల మంది ప్రయాణించేందుకు వీలుగా ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతామని సీఎం స్టాలిన్ వివరించారు. దీంట్లో 2 రన్ వేలు, ప్రయాణికుల టెర్మినల్ భవనాలు, కార్గో టెర్మినల్, ట్యాక్సీ వేలు, యాప్రాన్ ఉంటాయని వివరించారు. 

విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుండడం, సరకు రవాణా రంగంలో ఏర్పడిన డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం చేపడుతున్నట్టు స్పష్టం చేశారు.

More Telugu News