Fire Accident: మధ్యప్రదేశ్ లోని ఓ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం... 8 మంది సజీవదహనం

  • జబల్ పూర్ లో దుర్ఘటన
  • ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మంటలు
  • మరణించిన వారిలో నలుగురు ఆసుపత్రి ఉద్యోగులు
  • జనరేటర్ లో మంటలు ఆసుపత్రి అంతా వ్యాపించిన వైనం
Huge fire accident in a hospital in Jabalpur

మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 8 మంది సజీవదహనమయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చందల్ భాటా ప్రాంతంలో ఉన్న న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. కొద్దిసమయంలోనే అగ్నికీలలు ఆసుపత్రి అంతటా వ్యాపించాయి. 

కాగా, మరణించిన వారిలో నలుగురు ఆసుపత్రి ఉద్యోగులేనని భావిస్తున్నారు. మిగతా వారు రోగులు అని తెలుస్తోంది. జనరేటర్ నుంచి చెలరేగిన మంటలే ఈ అగ్నిప్రమాదానికి కారణమయ్యాయని భావిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది.

More Telugu News