Chiranjeevi: రవితేజకి తల్లి పాత్రలో జయసుధ !

  • నటిగా 50 ఏళ్లు పూర్తిచేసుకున్న జయసుధ 
  • కొంతకాలంగా సినిమాలకి దూరం 
  • చిరూ 154వ సినిమాకి గ్రీన్ సిగ్నల్
  • ఆల్రెడీ షూటింగు దశలో ఉన్న ప్రాజెక్టు  
Jayasudha  in Chiranjeevi Movie

జయసుధ ఇటీవలే నటిగా 50 వసంతాలను పూర్తిచేసుకున్నారు. ఈ మధ్య కొంత గ్యాప్ తీసుకున్న జయసుధ, మళ్లీ చిరంజీవి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. చిరంజీవి 154వ సినిమాగా 'వాల్తేర్ వీరయ్య' సినిమా రూపొందుతోంది. బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాలో రవితేజ కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగులో ఇటీవలే ఆయన జాయిన్ అయ్యాడు. ఆయన తల్లి పాత్ర కూడా ఈ సినిమాలో ముఖ్యమైనదే. ఈ నేపథ్యంలో ఆ పాత్ర  కోసం సుమలతను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు జయసుధను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

మెగాస్టార్ సినిమా కావడం .. మరో స్టార్ హీరోకి తల్లి పాత్ర కావడం .. ఆ పాత్ర తనకి నచ్చడం వలన జయసుధ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి'లో ఆమె రవితేజ తల్లిగా చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News