South Central Railway: హైదరాబాద్‌లో నేడు 34 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు

  • నిర్వహణ సర్వీసుల కారణంగా సర్వీసుల రద్దు
  • లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో 9 సర్వీసుల రద్దు
  • ప్రయాణికులు సహకరించాలని కోరిన రైల్వే
South Central Railway Cancelled 34 MMTS Trains

హైదరాబాద్‌లో నేడు 34 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో నడిచే 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో 7 సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

అలాగే, సికింద్రాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్‌లో ఒక్కో సర్వీసును రద్దు చేసినట్టు తెలిపింది. నిర్వహణ సమస్యల కారణంగా సర్వీసులను రద్దు చేసినట్టు తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరింది.

More Telugu News