Sensex: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 712 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 229 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 7.27 శాతం పెరిగిన టాటా స్టీల్ షేర్ విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. రూపాయి బలపడటంతో పాటు అంతర్జాతీయంగా సానుకూలతలు ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 712 పాయింట్లు లాభపడి 57,570కి చేరుకుంది. నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 17,158 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (7.27%), సన్ ఫార్మా (5.45%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.64%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.51%), ఏసియన్ పెయింట్స్ (2.38%).

టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ (-3.96%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.97%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.77%), ఐటీసీ (-0.13%), యాక్సిస్ బ్యాంక్ (-0.06%).

More Telugu News