Vijay Devarakonda: ముంబై లోకల్​ ట్రైన్ లో హీరోయిన్ అనన్యా పాండే ఒడిలో పడుకొని కునుకు తీసిన విజయ్

  • లైగర్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా హీరో హీరోయిన్లు
  • ముంబైలో ట్రాఫిక్ తప్పించుకునేందుకు మెట్రో లో ప్రయాణం
  • ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నటి
Vijay Deverakonda and Ananya Panday travel in Mumbai train as they begin promotions

‘లైగర్’ చిత్రంతో విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ యువ నటి అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషించారు.

ఇక ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ అవుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నారు. చిత్రం బృందం ఇప్పటికే ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో విజయ్, అనన్య పాల్గొన్నారు. వివిధ అంశాలపై ఈ ఇద్దరూ బోల్డ్ గా సమాధానాలు ఇచ్చారు.

అదే సమయంలో వివిధ ఈవెంట్లలో పాల్గొంటూ ‘లైగర్’ను జనాల్లోకి తీసుకెళ్లే  ప్రయత్నం చేస్తున్నారు హీరో విజయ్, హీరోయిన్ అనన్య. ఈ క్రమంలో ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు ఈ ఇద్దరూ ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయణించారు. ముంబైలో ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకునేందుకు వీరు ట్రైన్ ఎంచుకున్నారు. 

ట్రైన్ వచ్చే వరకూ రైల్వే స్టేషన్‌లో చాలా సేపు వేచి ఉన్నారు. ట్రైన్లో ఎక్కిన తర్వాత ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆలసిపోయాడో ఏమో గానీ విజయ్ కొద్దిసేపు అనన్య ఒడిలో పడుకొని కునుకు తీశాడు. ఈ ఫొటోలను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘లైగర్ ప్రమోషన్స్ ‘ట్రాక్’లో ఉన్నాయి. లెట్స్ గో బాయ్స్’ అని పేర్కొంది.

More Telugu News