Appalaraju: తిరుమలలో అనుచరులతో కలిసి మంత్రి వీఐపీ దర్శనం.. భక్తుల ఆగ్రహం

  • 150 మంది అనుచరులతో తిరుమలకు వెళ్లిన మంత్రి 
  • అందరికీ ప్రొటోకాల్ దర్శనం చేయించాలని ఒత్తిడి
  • క్యూలైన్లోనే వెళ్లి దర్శనం చేసుకున్నామన్న మంత్రి  
Minister Appalaraju in Tirumala

ఏపీ మంత్రి అప్పలరాజు 150 మంది అనుచరులతో కలిసి ఈ రోజు తిరుమలకు వెళ్లారు. వీరందరికీ కూడా వీఐపీ ప్రొటోకాల్ దర్శనం కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. అయితే, ఈ అంశంపై అప్పలరాజు మాట్లాడుతూ, తన నియోజకవర్గానికి చెందిన 150 మందితో స్వామివారి దర్శనానికి వచ్చానని... తాను కూడా సామాన్య భక్తుడి మాదిరే క్యూలైన్ లో వెళ్లి స్వామిని దర్శించుకున్నానని చెప్పారు. ప్రొటోకాల్ దర్శనం కోసం అధికారులపై తాను ఒత్తిడి తీసుకురాలేదని అన్నారు.  

More Telugu News