Athlete: కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత బృందంలో డోపింగ్ కలకలం

  • జులై 28 నుంచి కామన్వెల్త్ క్రీడలు
  • ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా క్రీడోత్సవం
  • మహిళల రిలే టీమ్ లో ఓ అథ్లెట్ తొలగింపు
  • నిషిద్ధ ఉత్ప్రేరకం వాడినట్టు సమాచారం
Commonwealth Games bound Indian athlete reportedly tested positive in dope test

మరో మూడ్రోజుల్లో కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కానుండగా, భారత అథ్లెటిక్స్ బృందంలో డోపింగ్ కలకలం రేగింది. మహిళల 4×100 రిలే బృందంలో ఓ అథ్లెట్ నిషిద్ధ ఉత్ప్రేరకం వాడినట్టు తెలుస్తోంది. డోప్ టెస్టులో పాజిటివ్ రావడంతో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత జట్టు నుంచి ఆ మహిళా అథ్లెట్ ను తొలగించినట్టు వెల్లడైంది. 

ఆ అథ్లెట్ పేరును భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ) బయటపెట్టలేదు. ఈ పరిణామం అనంతరం, మహిళల రిలే టీమ్ లో ప్రస్తుతం నలుగురు సభ్యులే ఉన్నారు. తొలగించిన అథ్లెట్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది తెలియరాలేదు. కామన్వెల్త్ క్రీడలు ఈసారి ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి.

More Telugu News