Hathras: హత్రాస్‌లో కన్వర్ యాత్రికులపై నుంచి దూసుకెళ్లిన ట్రక్.. ఆరుగురి దుర్మరణం

  • తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో ఘటన
  • హరిద్వార్ నుంచి గ్వాలియర్‌కు వెళ్తున్న యాత్రికులు
  • మరొకరి పరిస్థితి విషమం
6 dead after truck mows down Kanwar devotees in Hathras

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో విషాదం చోటుచేసుకుంది. కన్వర్ యాత్రికులపై నుంచి ట్రక్కు దూసుకెళ్లడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హత్రాస్ ఆగ్రా రోడ్డులోని బదర్ గ్రామంలో ఈ తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. బాధితులందరూ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందినవారు. 

మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆగ్రా మెడికల్ కాలేజీలో చేర్చారు. కన్వర్ యాత్రికులు హరిద్వార్ నుంచి గ్వాలియర్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను గుర్తించామని, త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

More Telugu News