Tollywood: ముగ్గురం కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించాం: నాగ చైతన్య

  • తొమ్మిదో తరగతిలో ఒక అమ్మాయిని ప్రేమించానన్న చైతూ
  • ‘థాంక్యూ’ చిత్రం ప్రమోషన్స్ లో వెల్లడించిన నాగచైతన్య
  • రేపు విడుదల అవుతున్న ‘థాంక్యూ’
Naga chaitanya tells about his first love

అక్కినేని నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటించిన సినిమా 'థ్యాంక్యూ' ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ‘మనం’తో అక్కినేని కుటుంబానికి గుర్తుండిపోయే విజయం అందించిన విక్రమ్‌ కె. కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంపై చైతూ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. పాటలకు, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. 

అక్కినేని అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో చిత్రం యూనిట్ ప్రమోషన్లతో సందడి చేస్తోంది. తాజాగా, హీరో హీరోయిన్లు నాగచైతన్య, రాశీ ఖన్నా  ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమా విశేషాలు గురించి, తమ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడారు. నటుడు హేమంత్ ఈ ఇద్దరినీ ఇంటర్వ్యూ చేశాడు. 

ఈ క్రమంలో చైతూ.. తన మొదటి ప్రేమ గురించి వెల్లడించాడు. తాను తొమ్మిదో తరగతిలోనే ప్రేమలో పడ్డానని చెప్పాడు. ముగ్గురు స్నేహితులం కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించేవాళ్లమని తెలిపాడు. అయితే ఆ అమ్మాయి తమ హృదయాలను ముక్కలు చేసి వెళ్లిపోయిందని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత తాము ముగ్గురం మంచి స్నేహితులుగా మారిపోయామని తెలిపారు.  

More Telugu News