Karnataka: వేగంగా దూసుకొచ్చి న‌లుగురి ప్రాణాలు తీసిన అంబులెన్స్... వీడియో ఇదిగో

  • క‌ర్ణాట‌క‌లోని ఉడుపిలో ఘ‌ట‌న‌
  • వేగంగా దూసుకువ‌చ్చి అడ్డంగా తిరిగిపోయిన అంబులెన్స్‌
  • టోల్ ప్లాజా సిబ్బందిని ఢీకొని ఆపై తిర‌గ‌బ‌డిపోయిన వైనం
  • ప్ర‌మాదంలో మ‌రో న‌లుగురికి గాయాలు
four people died in a ambulance toppled at a toll gate in karnataka

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆసుప‌త్రికి త‌ర‌లించే క్ర‌మంలో ప్ర‌మాదానికి గురైన ఓ అంబులెన్స్ న‌లుగురి ప్రాణాలు తీసింది. కర్ణాట‌క‌లోని ఉడుపి జిల్లాలో బుధ‌వారం చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రోగిని త్వ‌రిత‌గ‌తిన ఆసుప‌త్రికి త‌ర‌లించే క్ర‌మంలో మితిమీరిన వేగంతో వ‌చ్చిన స‌ద‌రు అంబులెన్స్ ఓ టోల్ ప్లాజా వ‌ద్ద అదుపు త‌ప్పింది. టోల్ ప్లాజాలో ప‌నిచేసే సిబ్బందిని ఢీకొట్టిన అంబులెన్స్ ఆపై జారుకుంటూ అల్లంత దూరం వెళ్లి బోల్తా ప‌డింది. 

ఈ ఘ‌ట‌న‌లో అంబులెన్స్ డ్రైవ‌ర్ స‌హా న‌లుగురు చ‌నిపోగా... మ‌రో న‌లుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. అంబులెన్స్ టోల్ ప్లాజాకు స‌మీపిస్తున్న స‌మ‌యంలో వాహ‌నాల దారిలో ప‌డిపోయిన ఓ డివైడ‌ర్‌ను తీసేందుకు వెళ్లిన టోల్ ప్లాజా ఉద్యోగి... అంబులెన్స్ వేగంగా దూసుకురావ‌డంతో బిత్త‌ర‌పోయాడు. అంబులెన్స్ నుంచి త‌ప్పించుకునేందుకు అత‌డు చేసిన య‌త్నాలు స‌ఫ‌లం కాలేదు. వేగంగా వ‌చ్చి అడ్డంగా తిరిగిన అంబులెన్స్ తొలుత ఆ టోల్ ప్లాజా ఉద్యోగినే ఢీకొట్టింది. ఆపై నేల‌పై జారుకుంటూ వెళ్లి ప‌ల్టీ కొట్టింది. దీంతో డ్రైవ‌ర్ కేబిన్‌లోని వారంతా టాప్ లేచిపోవ‌డంతో ఎగిరి ప‌డ్డారు.

More Telugu News