Palnadu District: పల్నాడులో బోల్తా కొట్టిన ఆయిల్ ట్యాంకర్.. బిందెలు, క్యాన్లతో ఎగబడుతున్న జనాలు!

  • నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద బోల్తాకొట్టిన ఆయిల్ ట్యాంకర్
  • క్షణాల్లో సమీప గ్రామాలకు వ్యాపించిన సమాచారం
  • దొరికినకాడికి ఆయిల్ తీసుకెళ్తున్న జనాలు
Oil tanker accident in Palnadu

పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆయిల్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా కొట్టింది. ఈ విషయం క్షణాల్లో సమీప గ్రామాలకు వ్యాపించింది. ఇంకేముంది... ప్రమాదం జరిగిన ప్రాంతానికి జనాలు పోటెత్తారు. ఆడ, మగ అనే తేడా లేకుండా బిందెలు, క్యాన్లు, బక్కెట్లు ఇలా ఏది దొరికితే దాన్ని పట్టుకుని ఆ ప్రాంతానికి ఎగబడ్డారు. దొరికినకాడికి ఆయిల్ నింపుకుని వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నై నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ట్యాంకర్ ప్రమాదానికి గురైనట్టు సమాచారం.

More Telugu News