Vijayasai Reddy: జగన్ కు, వైఎస్ భారతికి ధన్యవాదాలు తెలిపిన విజయసాయిరెడ్డి

  • రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ప్రమాణస్వీకారం
  • వరుసగా రెండోసారి పెద్దల సభలోకి విజయసాయి
  • బాధ్యతలను మరింత అంకితభావంతో నిర్వర్తిస్తానని వ్యాఖ్య
Vijayasai Reddy thanks Jagan and YS Bharathi after taking oath as Rajya Sabha member

రాజ్యసభ సభ్యుడిగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. పెద్దల సభలో ఆయన అడుగుపెట్టడం ఇది వరుసగా రెండోసారి. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేయడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తనను మరోసారి రాజ్యసభ సభ్యుడిని చేసిన ముఖ్యమంత్రి జగన్ కు, వైఎస్ భారతమ్మకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇకపై తన బాధ్యతలను మరింత అంకితభావంతో నిర్వర్తిస్తానని తెలిపారు.

More Telugu News