Mahesh Babu: మహేశ్ బాబు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్!

  • త్రివిక్రమ్ సినిమాకి సన్నాహాలు 
  • వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్
  • మహేశ్ సరసన ఇద్దరు భామలు 
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్   
Trivikram Movie Update

ప్రియాంక అరుళ్ మోహన్ .. 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా ద్వారా ఈ సుందరి తెలుగు తెరకి పరిచయమైంది. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ఆకట్టుకుంది. ఆ తరువాత శర్వానంద్ జోడీగా 'శ్రీకారం' సినిమా కూడా చేసింది. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. 

దాంతో ప్రియాంక తమిళ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి .. అక్కడ వరుస అవకాశాలను అందుకుంటోంది. ఈ నాజూకు భామకు అక్కడ అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. తాజాగా మహేశ్ జోడీగా ఈ బ్యూటీని త్రివిక్రమ్ ఎంపిక చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మహేశ్ హీరోగా త్రివిక్రమ్ చేయనున్న సినిమా వచ్చే నెలలో పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమాకి ఒక కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. రెండవ కథానాయికగా శ్రీలీల పేరు వినిపించింది. తాజాగా ప్రియాంకా అరుళ్ మోహన్ పేరు తెరపైకి వచ్చింది. హారిక అండ్ హాసిని వారు నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 'సంక్రాంతి'కి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

More Telugu News