Sensex: వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 372 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 91 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • అమ్మకాల ఒత్తిడితో లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు సానుకూలంగానే ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 372 పాయింట్లు కోల్పోయి 53,514కు పడిపోయింది. నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 15,966 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్;
ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.42%), భారతి ఎయిర్ టెల్ (2.87%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.53%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.35%), రిలయన్స్ (1.77%). 

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.97%), ఏసియన్ పెయింట్స్ (-1.70%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.40%), సన్ ఫార్మా (-1.09%), ఎన్టీపీసీ (-1.02%).

More Telugu News