Sensex: స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 86 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 4 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా లాభపడ్డ టాటా స్టీల్ షేర్ విలువ
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు... మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోలుకున్నాయి. కీలక సూచీల్లో కొనుగోళ్ల సందడి కనిపించడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్లు నష్టపోయి 54,395కి పడిపోయింది. నిఫ్టీ 4 పాయింట్లు కోల్పోయి 16,216 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (3.04%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.86%), డాక్టర్ రెడ్డీస్ (2.25%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.83%), ఏసియన్ పెయింట్స్ (1.80%). 

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-5.03%), టీసీఎస్ (-4.64%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-4.10%), ఇన్ఫోసిస్ (-2.72%), విప్రో (-1.91%).

More Telugu News