Maharashtra: నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు: పోలీసుల‌కు మ‌హారాష్ట్ర సీఎం షిండే ఆదేశం

  • ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌తో భేటీ అయిన షిండే
  • వీఐపీల సెక్యూరిటీపై చ‌ర్చ‌
  • త‌మ‌ది సామాన్యుల ప్ర‌భుత్వ‌మ‌ని చెప్పిన షిండే
  • త‌న మార్గంలో భ‌ద్ర‌త‌ను త‌గ్గించాల‌ని ఆదేశం
maharashtra cm eknath shinde orders so protocal to his convoy

ముఖ్య‌మంత్రి హోదాలో తాను ప్ర‌యాణించే కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిలిపివేయాల్సిన అవ‌స‌రం లేద‌ని మ‌హారాష్ట్ర నూత‌న సీఎం ఏక్‌నాథ్ షిండే రాష్ట్ర పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా త‌న కాన్వాయ్‌కు ప్ర‌త్యేకంగా ఏ ప్రొటోకాల్ కూడా అవ‌స‌రం లేద‌ని ఆయ‌న సూచించారు. ఈ మేర‌కు ముంబై పోలీస్ క‌మిష‌నర్‌కు షిండే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు.

శుక్ర‌వారం ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌తో స‌మావేశ‌మైన సంద‌ర్భంగా షిండే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. వీవీఐపీల ప్ర‌యాణాల కోసం సామాన్యులు ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంద‌ని ఈ సంద‌ర్భంగా షిండే వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల‌కు క‌లుగుతున్న ఈ ఇబ్బందిని తొల‌గించేందుకు సీఎం కాన్వాయ్‌కు ఎలాంటి ప్రొటోకాల్ పాటించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న సూచించారు. అంతేకాకుండా తాను ప్ర‌యాణించే మార్గంలో భ‌ద్ర‌త‌ను కూడా త‌గ్గించాల‌ని ఆయ‌న సూచించారు. త‌మ‌ది సామాన్యుల ప్ర‌భుత్వ‌మ‌ని.. ఈ కార‌ణంగానే వీఐపీల క‌న్నా... సామాన్యుల‌కే అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌నుకుంటున్నామ‌ని ఆయ‌న చెప్పారు.

More Telugu News