KTR: ఇది అందరికీ మోదీగారు ఇచ్చిన బహుమతి: కేటీఆర్ సెటైర్లు

  • వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచిన కేంద్రం
  • హైదరాబాద్ లో రూ. 1,105కి చేరుకున్న సిలిండర్ ధర
  • అచ్చే దిన్ వచ్చాయన్న కేటీఆర్
KTS satires on Modi for increasing Gas rate

వంట గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగిన సంగతి తెలిసిందే. 14 కేజీల సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ. 50 పెంచింది. తాజా పెంపుతో హైదరాబాద్ లో రూ. 1,055గా ఉన్న సిలిండర్ ధర రూ. 1,105కి చేరుకుంది. ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 1,053కి చేరుకుంది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై తెలంగాణ మంత్రి విమర్శలు గుప్పించారు. 'మంచి రోజులు (అచ్చే దిన్) వచ్చాయి. అందరికీ శుభాకాంక్షలు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగి... రూ. 1,050 దాటింది. ఇది అందరికీ మోదీ ఇచ్చిన బహుమతి' అని ట్వీట్ చేశారు. మరోవైపు, గ్యాస్ ధరను మరోసారి పెంచడంతో సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News