Bonam: బెజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారు బోనం సమర్పణ

  • తెలంగాణలో బోనాల సీజన్
  • ప్రతి ఏటా తెలంగాణ నుంచి ఇంద్రకీలాద్రికి బోనాలు
  • నేడు భారీ ఊరేగింపుతో బోనం సమర్పణ
  • బోనం తలకెత్తుకున్న జోగిని విశా క్రాంతి
Telangana Bonam offered to Vijayawada Kanakaduramma

తెలంగాణలో బోనాల సీజన్ నడుస్తోంది. ప్రతి ఏటా తెలంగాణ నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బోనాలు సమర్పించడం తెలిసిందే. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామాతకు ఆనవాయతీ ప్రకారం తెలంగాణ నుంచి బంగారు బోనం తీసుకువచ్చారు. హైదరాబాద్ మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో భక్తులు భారీ ఊరేగింపుతో వచ్చి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఊరేగింపు కమిటీ చైర్మన్ రాకేష్ తివారీ, ఇతర కమిటీ సభ్యులు, తెలంగాణ కళాకారులు పాల్గొన్నారు. జోగిని విశా క్రాంతి బోనాన్ని తలపై మోశారు.

More Telugu News