Nagababu: రాజకీయ శిక్షణా తరగతుల ఏర్పాట్లను పర్యవేక్షించిన నాగబాబు

  • జనసేన క్రియాశీలక వీరమహిళలకు రేపు శిక్షణా తరగతులు
  • శిక్షణా తరగతులను రేపు ప్రారంభించనున్న పవన్ కల్యాణ్
  • ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న నాగబాబు
Nagababu inspects Janasena political training classes

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రేపు 'జనసేన క్రియాశీలక వీరమహిళల'కు రాజకీయ శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు శిక్షణా తరగతుల ఏర్పాట్లను ఈరోజు పర్యవేక్షించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల వీర మహిళలకు శిక్షణా తరగతులను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ తరగతులను రేపు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. 

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, జనసేన రాజకీయ వ్యవహారాల్లో మహిళలకు గౌరవప్రదమైన స్థానాన్ని అందించాలని ఆకాంక్షించే పవన్ కల్యాణ్ ప్రారంభిస్తున్న శిక్షణా తరగతులను వినియోగించుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

More Telugu News