Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. భారీగా నష్టపోయిన రిలయన్స్!

  • వరుసగా మూడో రోజు నష్టపోయిన మార్కెట్లు
  • 111 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 28 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Reliance looses more than 7 percent

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. హెవీ వెయిట్ రిలయన్స్ తో పాలు పలు ఎనర్జీ స్టాకులు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు నష్టపోయాయి. చమురు ఉత్పత్తులపై ఎగుమతి సుంకాలను కేంద్రం విధించడంతో ఈ సంస్థలు ఒత్తిడికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 111 పాయింట్లు కోల్పోయి 52,907కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 15,752 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
ఐటీసీ (3.99%), బజాన్ ఫైనాన్స్ (3.97%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.63%), ఏసియన్ పెయింట్స్ (2.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.34%). 

టాప్ లూజర్స్
రిలయన్స్ (-7.14%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.53%), ఎన్టీపీసీ (-1.82%), భారతి ఎయిర్ టెల్ (-1.54%), మారుతి (-0.87%).

More Telugu News