Rohit Sharma: ఇంగ్లండ్ తో టీ20, వన్డే జట్లను ప్రకటించిన బీసీసీఐ

  • మొదటి టెస్ట్ మినహా అన్నింటికీ రోహిత్ అందుబాటు
  • సారథ్య బాధ్యతలు అతడికే
  • టీ20, వన్డేలకు ఆటగాళ్ల పరంగా మార్పులు
Rohit Sharma to lead India in 1st T20 vs England

ఇంగ్లండ్ తో నేటి నుంచి జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ (గతేడాది వాయిదా పడినది)కు అందుబాటులో ఉండని రోహిత్ శర్మ, ఇంగ్లండ్ తో జరిగిన  టీ20, వన్డే సిరీస్ లకు సారథ్యం వహించనున్నాడు. రోహిత్ శర్మ జులై 7న జరిగే మొదటి టీ20కి అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. కోహ్లీ, ఇతర రెగ్యులర్ ఆటగాళ్లు రెండో టీ20 నుంచే అందుబాటులోకి వస్తారు. రోహిత్ శర్మ కరోనా పాజిటివ్ గా తేలినప్పటికీ.. వారం రోజుల్లో మొదలయ్యే మ్యాచ్ కోసం అతడ్ని బీసీసీఐ ఎంపిక చేయడం ఆశ్చర్యకరం. మొదటి టీ20 మ్యాచ్ కు భిన్న స్క్వాడ్ ను సెలక్టర్లు ప్రకటించారు. టెస్ట్ మ్యాచ్ లో ఆడిన వారికి కొంత విశ్రాంతి ఇచ్చారు.  

మొదటి టీ20
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శామ్సన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యుజువేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

రెండు, మూడో టీ20
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్.

మూడు వన్డేలకు
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, అక్సర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, మమహ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్హదీప్ సింగ్.

More Telugu News