Alluri Seetharama Raju: మోదీ భీమ‌వ‌రం టూర్‌కు రావాలంటూ చిరంజీవికి ఆహ్వానం

  • ఈ నెల 4న భీమ‌వరానికి ప్ర‌ధాని మోదీ
  • అల్లూరి 125వ జ‌యంతి వేడుక‌ల‌కు హాజ‌రు
  • మ‌న్యం వీరుడి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్న మోదీ
  • చిరంజీవిని ఆహ్వానిస్తూ కిష‌న్ రెడ్డి లేఖ‌
kishan reddy invites chiranjeevi to pm modis bheemavaram tour

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 4న ఏపీలో జ‌ర‌ప‌నున్న ప‌ర్య‌ట‌న‌లో పాలుపంచుకోవాలంటూ టాలీవుడ్ అగ్ర న‌టుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానించింది. ఈ మేర‌కు చిరంజీవికి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి ఆహ్వానం పంపారు. 

ఈ నెల 4న ఏపీకి రానున్న మోదీ... ఆజాదీ అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా భీమ‌వ‌రంలో జ‌ర‌గ‌నున్న మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125 జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా భీమ‌వ‌రంలో అల్లూరి విగ్ర‌హాన్ని మోదీ ఆవిష్క‌రించ‌నున్నారు. 
.

More Telugu News