KCR: తమిళిసై తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్

  • గత 9 నెలలుగా రాజ్ భవన్ కు కూడా వెళ్లని కేసీఆర్
  • హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారానికి హాజరైన సీఎం
  • ఆత్మీయంగా మాట్లాడుకున్న గవర్నర్, ముఖ్యమంత్రి
KCR in Governor Tamilisai tea party

తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య గత కొంత కాలంగా విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 9 నెలలుగా రాజ్ భవన్ కు కూడా కేసీఆర్ వెళ్లలేదు. అయితే, ఈరోజు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం రాజ్ భవన్ లో జరిగింది. ఉజ్జల్ భుయాన్ చేత తమిళిసై ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనే అనుమానాలకు తెరదించుతూ ఆయన రాజ్ భవన్ కు వెళ్లారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి ఇద్దరూ పాత విభేదాలను పక్కన పెట్టి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందులో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒక టేబుల్ పై కూర్చొని ముచ్చటించారు. ఇదే సందర్భంగా అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా కేసీఆర్ మాట్లాడారు. అందరూ నవ్వుతూ ఆత్మీయంగా మాట్లాడుకోవడంతో అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.

More Telugu News