Allu Arjun: ఇతర దేశాల్లోను 'పుష్ప 2' చిత్రీకరణ!

  • సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
  • 'పుష్ప 2' కోసం జరుగుతున్న సన్నాహాలు 
  • 400  కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టుగా టాక్
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
Pushpa 2 movie update

అల్లు అర్జున్ .. సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సంచలన విజయాన్ని సాధించింది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, కథాకథనాల పరంగానే కాకుండా మ్యూజికల్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాను చాలావరకూ మారేడుమిల్లి - రంపచోడవరం ఫారెస్టులో చిత్రీకరించారు. అడవిలో చిత్రీకరించిన సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలను ఫారిన్ లో అనుకున్నప్పటికీ, కోవిడ్ నిబంధనల కారణంగా అక్కడికి వెళ్లలేకపోయారు. 

ఇక ఇప్పుడు 'పుష్ప 2' సినిమాను మాత్రం, ఇండొనేషియా .. సింగపూర్లలో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. విదేశాల్లోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News