mumbai: ముంబైలో 144 సెక్షన్ విధింపు

  • శివసేనలో ప్రకంపనలు పుట్టిస్తున్న రెబెల్ ఎమ్మెల్యేలు
  • రెబెల్స్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
  • ఏక్ నాథ్ షిండే నివాసం వద్ద భద్రత పెంపు
section 144 imposed in Mumbai

మహారాష్ట్రలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. శివసేన రెబెల్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శివసైనికులు రెబెల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు చోట్ల రెబెల్స్ ఇళ్లు, కార్యాలయాల ముందు ఆందోళన చేపట్టారు. వారి ఫ్లెక్సీలను చింపేయడంతో పాటు దిష్టిబొమ్మలను దహనం చేశారు.


ఈ నేపథ్యంలో థానేలోని తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే నివాసం వెలుపల భద్రతను పెంచారు. అంతేకాదు, ముంబైలో ఏ క్షణంలోనైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో సెక్షన్ 144 విధించారు. వచ్చే నెల 10వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.

More Telugu News