Sensex: తగ్గిన క్రూడాయిల్ ధర.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 443 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 143 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 6 శాతానికి పైగా లాభపడ్డ మారుతి షేర్ విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు మధ్యాహ్నం మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ... ఆ తర్వాత భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఆటోమొబైల్, టెక్నాలజీ, ఫార్మా స్టాకుల అండతో మార్కెట్లు పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. దీంతో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 443 పాయింట్లు లాభపడి 52,265కి చేరుకుంది. నిఫ్టీ 143 పాయింట్లు పెరిగి 15,556 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (6.33%), మహీంద్రా అండ్ మహీంద్రా (4.41%), ఏసియన్ పెయింట్స్ (3.39%), భారతి ఎయిల్ టెల్ (2.96%), టీసీఎస్ (2.70%). 

టాప్ లూజర్స్:
రిలయన్స్ (-1.62%), ఎన్టీపీసీ (-0.94%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.90%).

More Telugu News