Rakshit Atluri: హీరో రక్షిత్ అట్లూరి బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన 'శశివదనే' చిత్రబృందం

  • రక్షిత్ అట్లూరి హీరోగా 'శశివదనే' చిత్రం
  • హీరోయిన్ గా కోమలీ ప్రసాద్
  • సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం
  • దసరాకు రానున్న 'శశివదనే'
Shashivadane team releases hero Rakshit Atluri first look poster on his birthday

యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి హీరోగా గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్, రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, 'రంగస్థలం' మహేష్ నటిస్తున్న ఈ చిత్రానికి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి అహితేజ బెల్లంకొండ నిర్మాత. 

ఈ రోజు చిత్ర హీరో రక్షిత్ అట్లూరి బర్త్ డేను పురస్కరించుకొని చిత్ర యూనిట్ హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ... గోదావరి నేపథ్యంలో తీస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఈ ‘శశివదనే’ చిత్రం అని వెల్లడించారు. ఇందులోని లవ్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయని తెలిపారు. దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన ఈ సినిమాను చాలా గ్రాండియ‌ర్‌గా, హై స్టాండ‌ర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్, విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయని అన్నారు. 

ఇందులో ఉన్న ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయని, నటీ, నటులు సాంకేతిక నిపుణులు అందరూ సపోర్ట్ చేయడంతో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందని చెప్పారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

More Telugu News