Pakistani: అలియాభట్ పోస్టర్ తో పాకిస్థాన్ లో ఓ రెస్టారెంట్ ఫుల్ బిజినెస్

  • అలియా వేశ్య పాత్ర సీన్ తో పోస్టర్
  • పురుషులకు 25 శాతం డిస్కౌంట్ ఆఫర్  
  • ‘ఆజావో రాజా.. మెన్స్ మండే డిస్కౌంట్ సొంతం చేసుకో’ అంటూ ప్రకటన
  • తిట్టిపోస్తున్న నెటిజన్లు
Pakistani restaurant draws flak for using Alia Bhatt scene in Aja na Raj advertisement

గుంగూబాయ్ కతియావాడి గుర్తుందా..? అలియాభట్ ఓ వేశ్య నుంచి వేశ్యా కేంద్రం నిర్వాహకురాలిగా ఎదిగే పాత్రతో విమర్శకులను సైతం మెప్పించింది. ఈ సినిమాలో విటులను అలియాభట్ చేతితో సైగ చేస్తూ ఆహ్వానం పలికే సీన్ ఉంటుంది. సరిగ్గా ఇదే సీన్ ను పోస్టర్ గా ముద్రించి తన రెస్టారెంట్ లో పెట్టుకున్నాడు ఓ పాకిస్థానీ.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనిపై చాలా మంది పాకిస్థాన్ రెస్టారెంట్ వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. అలియాభట్ పోస్టర్ ను వాడుకుంటూ రెస్టారెంట్ కు వచ్చే మగవారికి డిస్కౌంట్లు ప్రకటించడమే వివాదానికి దారితీసింది. 

మెన్స్ మండే పేరుతో కరాచీలోని ఓ రెస్టారెంట్ ప్రకటన ఇచ్చింది. మగవారికి బిల్లులో 25 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ప్రకటనలో ’‘ఆజా నా రాజా - దేనికోసం ఎదురు చూస్తున్నావు?. ఆజావో.. మెన్స్ మండే రోజు 25 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకో’’ అన్న ట్యాగ్ లైన్ పెట్టాడు. నీవు పెట్టిన సీన్, ఇస్తున్న ఆఫర్ స్త్రీ ద్వేషాన్ని, నీ అజ్ఞానానికి నిదర్శనం’’ అని ఓ యూజర్ మండిపడ్డాడు. (వీడియో కోసం)

More Telugu News