Chiranjeevi: బాలయ్యతో పాటు చిరూ వచ్చేది కూడా దసరాకే!

  • షూటింగు దశలో 'గాడ్ ఫాదర్'
  • చిరూ చెల్లెలి పాత్రలో నయనతార 
  • ఆగస్టులో సినిమా రిలీజ్ లేనట్టే 
  • దసరాకి విడుదల చేసే అవకాశం
Godse Movie Update

చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతోంది. ఎన్వీ ప్రసాద్ తో కలిసి చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను, ఆగస్టులో విడుదల చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే అప్పటికి ఈ సినిమా థియేటర్లకు రావడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది.

'ఆహా' వారు ఇండియన్ ఐడల్ సింగింగ్ షోకి సంబంధించిన 'మెగా ఫినాలే' షోకి చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ షోకి తమన్ ఒక జడ్జిగా వ్యవహరిస్తుండగా .. యాంకర్ గా సింగర్ శ్రీరామ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఫినాలేలో తమన్ మాటలు,'గాడ్ ఫాదర్' రిలీజ్ విషయంలో అపోహలకు తెరదించాయి.

 చిరంజీవి సినిమా 'గాడ్ ఫాదర్'లో ఆయనకి చెల్లెలి పాత్రలో నయనతార నటిస్తోందనీ,  వాళ్లిద్దరి మధ్య ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుందని తమన్ అన్నాడు. ఆ సాంగ్ ను శ్రీరామ్ తో పాడిస్తామని తమన్ చెప్పాడు. అలాగే ఈ షోలో టైటిల్ కోసం పోటీ పడుతున్న అమ్మాయిని ఇదే పాట ద్వారా పరిచయం చేస్తామని అన్నాడు. 

నయనతార పోషించేది చిరంజీవి చెల్లెలి పాత్రేననే క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు ఈ పాటను ఇంకా చిత్రీకరించలేదని తెలిసింది. అందువలన ఈ సినిమా దసరాకి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా కూడా దసరాకే వస్తున్న విషయం తెలిసిందే.

More Telugu News